EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ :*ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం* *- యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం.*

    Author admin | 14 Jul 2026, 07:02 PM | NATIONAL, TELANGANA
    హైదరాబాద్ :*ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై ఐక్య ఉద్యమం* *- యుయస్పీసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం.*

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్:
    ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు మరియు విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఐక్య పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.
    యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో టిటిఎ అధ్యక్షుడు ఎస్ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జిఒ 25 ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, పిఒ 2018 కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని సమావేశం విమర్శించింది. టెట్ లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, సబ్జెక్టు వారీ పేపర్లతో స్పెషల్ టెట్ నిర్వహించాలని, బిసి, గిరిజన గురుకులాల టైంటేబుల్ మార్టాలని, మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, 5 వాయిదాల కరువు భత్యం (డిఎ) ను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
    ఈ సమావేశంలో యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్(టిఎస్ యుటిఎఫ్) సిహెచ్ అనిల్ కుమార్, ఎన్ తిరుపతి( టిపిటిఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డిటిఎఫ్), కొమ్ము రమేష్ (బిటిఎఫ్), వై విజయకుమార్, ఎం సైదులు (ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), బి కొండయ్య (ఎంఎస్ టిఎఫ్), లక్ష్మణ్(టిటిఎ), రవీందర్, లక్ష్మయ్య యాదవ్(టిపిటిఎఫ్) పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి